అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి: స్వాతి మాలీవాల్
ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దిల్లీ: ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేసినప్పటి నుంచీ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. ‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే ఇలాంటి వ్యక్తులు ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్నివైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నా’’ అని మాలీవాల్ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసేందుకే పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ధ్రువ్ను కలిసి తన వాదన వినిపిద్దామంటే.. అతడు తన ఫోన్కాల్స్కు స్పందించడం లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తోందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మే 13న మాలీవాల్పై జరిగిన దాడి కేసులో సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ను పోలీసులు మే 18న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిలు కోరుతూ బిభవ్ శనివారం స్థానిక కోర్టును ఆశ్రయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్గాంధీ నిజాయతీ గల రాజకీయ నేత: సైఫ్ అలీఖాన్
Saif Ali Khan-Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజాయతీ గల రాజకీయ నాయకుడని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అన్నారు. -
సరోగసీతో సంతానం పొందినా ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
సరోగసీ (Surrogacy)తో బిడ్డను పొందిన తల్లులు (commissioning mothers), గర్భాన్ని అద్దెకిచ్చిన తల్లులు (surrogate) ప్రభుత్వ సిబ్బంది అయితే వారు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. -
సంజయ్ రౌత్కు 15 రోజుల జైలుశిక్ష
పరువు నష్టం కేసులో శివసేన-యూబీటీ కీలక నేత, ఎంపీ సంజయ్రౌత్కు ఎదురుదెబ్బ తగిలింది. భాజపా నేత కిరీట్ సోమయ్య, ఆయన భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం... -
సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి
సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడేలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏ దేశమైనా గొప్ప దార్శనికతను కలిగి ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యాలను విధించుకోగలదని పేర్కొన్నారు. -
పేద విద్యార్థి ఐఐటీ సీటు కోసం.. ఏకమైన యూపీ గ్రామస్థులు
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టినా చదువులో సరస్వతీపుత్రుడైన అతుల్కుమార్ (18) ఐఐటీ సీటు కోసం ఉత్తర్ప్రదేశ్లోని టిటోడా అనే కుగ్రామం మొత్తం ఏకమైంది. -
మీకు ఎవరు ముఖ్యమో తెలుసుకోండి
కొంతమంది తమ ఖాళీ సమయాల్లో మీతో మాట్లాడతారు. మరికొందరు మీతో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించుకుంటారు. ఆ రెండింటి మధ్య తేడా తెలుసుకున్నప్పుడే మీకు ఎవరు ముఖ్యమో అర్థమవుతుంది. అలాంటి వారితో బంధానికి విలువివ్వండి. -
దిల్లీ స్థాయీసంఘం ఎన్నికలో ఎల్జీ జోక్యం.. హై డ్రామా
ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ) స్థాయీసంఘంలో ఖాళీగా ఉన్న ఆరోస్థానం కోసం గురువారం నిర్వహించతలపెట్టిన ఎన్నికలో చివరిక్షణాన లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వి.కె.సక్సేనా జోక్యంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఐటీ సవరణ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం
సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించి, అడ్డుకునేందుకు గాను సమాచార సాంకేతిక నిబంధనల(ఐటీ రూల్స్)కు కేంద్ర సర్కారు చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు గురువారం ప్రకటించింది. -
పుణ్యస్నానాలు ఆచరిస్తూ 46 మంది మృతి
బిహార్లో ‘జీవిత్పుత్రిక’ పండగ రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ వేర్వేరు దుర్ఘటనల్లో 46 మంది మరణించారు. వీరిలో 37మంది చిన్నారులేనని గురువారం అధికారులు ప్రకటించారు. -
చక్కెర కనీస విక్రయ ధర పెంపు!
చక్కెర కనీస విక్రయ ధరను పెంచడంతోపాటు 2024-25 ఏడాదిలో ఎగుమతులకు అనుమతించే అంశాన్నీ పరిశీలిస్తున్నామని కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. -
ఇక ప్రాచీన ప్రసాద వితరణే
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పలు దేవాలయాలు ప్రైవేటు వ్యాపారులు చేసే స్వీట్స్ను భక్తులకు ప్రసాదంగా పంచే విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. -
కన్నడనాట సీబీఐకి నో!
కర్ణాటక పరిధిలో ఏదైనా కేసులో విచారణ కోసం వచ్చేందుకు సీబీఐకి ప్రస్తుతం ఉన్న సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని కర్ణాటక మంత్రివర్గం తీర్మానించింది. -
ఏఆర్ డెయిరీ ఫుడ్స్పై నిఘా ఉంచండి
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన నేపథ్యంలో దిండుక్కల్ ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీ సరఫరా చేసే ఉత్పత్తులపై నిఘా ఉంచాలని కేంద్రప్రభుత్వ అధికారులు ఆదేశించారు. -
అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపు
అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏ గ్రేడ్ ప్రాంతాల్లో నిర్మాణం, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ రంగాల్లో పని చేసే నైపుణ్యం -
సంక్షిప్త వార్తలు (4)
మహిళలకు రక్షణ కల్పించే గృహహింస చట్టం-2005 ఒక పౌరస్మృతి అని, మతంతో, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఇది దేశంలోని మహిళందరికీ వర్తిసుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ మహిళ భరణం, -
21 మంది మైనర్లపై లైంగికదాడుల కేసులో వార్డన్కు మరణశిక్ష
అరుణాచల్ ప్రదేశ్ పాఠశాలలో 21 మంది మైనర్ విద్యార్థులపై లైంగికదాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డన్కు మరణశిక్ష విధిస్తూ యుపియాలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?: కేటీఆర్
-
జగన్ మళ్లీ కోడికత్తి నాటకాలాడతారని అనుమానాలు: శ్రీనివాసానంద సరస్వతి
-
రాహుల్గాంధీ నిజాయతీ గల రాజకీయ నేత: సైఫ్ అలీఖాన్
-
సరోగసీతో సంతానం పొందినా ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
-
భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే: యూకే మద్దతు
-
గంభీర్ స్థానంలో డ్వేన్ బ్రావో.. క్రికెట్కు వీడ్కోలు పలికిన గంటల్లోనే మెంటార్గా..