విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి విద్యార్థికి నాణ్యత గల విద్యను ప్రభుత్వ కళాశాలలోనే సాధ్యమవుతుందని ప్రిన్సిపాల్ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే చక్కటి విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష ఫలితాలు వెల్లడైన తర్వాత అధ్యాపకులు ఇంటింటా తిరుగుతూ ప్రవేశాల కొరకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రవేశాలు కొరకు అడ్మిషన్లు ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు. ఆసక్తిగల పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ మార్కుల జాబితాతో నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ (టీసీ లేకపోయినా) పొందే అవకాశం ఉందని తెలిపారు. మా కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఇసి, హెచ్ఈసి గ్రూపులలో తెలుగు, ఇంగ్లీష్ మీడియం తదుపరి ఒకేషనల్ నందు ఎంఎల్టి, ఈటీ, సిరికల్చర్ గ్రూపులు కూడా కలవని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ బోధనతో ఉత్తీర్ణతను కూడా సాధించడం జరుగుతోందని తెలిపారు. 2024 మార్చిలో ఉత్తమ ఫలితాలలో ద్వితీయ బైపీసీలో జి. పవన్ కుమార్954/1000, ద్వితీయ ఎంపీసీలో ఎం. లక్ష్మీ కుమార్ 942 మార్కులు, బి. గౌతమ్ 915 మార్కులు, ద్వితీయ ఈ టిలో ఎం.ప్రశాంత్ 833/1000, ద్వితీయ ఎం.ఎల్.టిలో వై.లిఖిత్ కుమార్830 మార్కులు మొదటి సంవత్సరం సీఈసీ లో ఎం. శాంతప్ప413/500, మొదటి ఎమ్మెల్ టి లో ఎం. ఎం. డి. ఆ యుబ్ 449 మార్కులు సాధించడం జరిగిందన్నారు. మరి ఫీజు వివరాలలో సైన్సు కు రూ.2,209, ఆర్ట్స్ కు రూ.1309, ఒకేషనల్ కు రూ.2,459 కట్ట వలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నప్పటికీ అడ్మిషన్స్ కొరకు సిబ్బంది కళాశాలలో అందుబాటులో ఉంటారని తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుండి కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కావున విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రైవేట్ కళాశాలలో వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయకుండా, ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని వారు తెలిపారు.