LIC Market share: ఎల్ఐసీ మార్కెట్ వాటాలో క్షీణత.. పెరిగిన ‘ప్రైవేట్’ షేర్!
LIC market share: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ వాటా సెప్టెంబర్ నెలలో క్షీణించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం మేర వాటా తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు వాటా స్వల్పంగా పెరిగింది.
LIC market share | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) మార్కెట్ వాటా క్షీణించింది. జీవిత బీమా రంగంలో తనకు ఎదురులేదంటూ ఇన్నాళ్లు నిరూపించుకుంటూ వచ్చిన ఆ సంస్థ.. మార్కెట్ వాటా (LIC market share) సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టింది. ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియం వసూళ్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో 68.25 శాతంగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ వాటా.. ఈ ఏడాది 58.50 శాతానికి తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల మార్కెట్ వాటా స్వల్పంగా పెరగడం గమనార్హం. అయితే, ప్రైవేటు సంస్థల అన్నింటి వాటా కలిపినా ఎల్ఐసీ మార్కెట్ వాటాకు ఇంకా చాలా దూరంలో ఉండడం గమనార్హం.
ఎల్ఐసీ సహా వివిధ జీవిత బీమా సంస్థల సెప్టెంబర్ నెల వ్యాపార సరళికి సంబంధించిన డేటాను లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో రూ.92,462 కోట్ల విలువైన కొత్త పాలసీలను ఎల్ఐసీ విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రీమియంలను ఎల్ఐసీ విక్రయించడం గమనార్హం. పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తక్కువగా అమ్ముడవ్వడం, నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తగినంత లేకపోవడం, కొన్ని బీమా ప్లాన్ల ఫీచర్లు, ధరల్లో మార్పులు వంటివి ఎల్ఐసీ మార్కెట్ క్షీణతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వాట్సాప్లో త్వరలో ‘సీక్రెట్ కోడ్’.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?
అదే సమయంలో ప్రైవేటు ఇన్సురెన్స్ సంస్థల మార్కెట్ వాటా పుంజుకోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్లో 31.75 శాతంగా ఉన్న వీటి వాటా.. ఈ ఏడాది 41.50 శాతానికి పెరిగింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్నే తీసుకుంటే.. సెప్టెంబర్లో మార్కెట్ వాటా 6.07 శాతం నుంచి 8.31 శాతానికి పెరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ వాటా 7.19 శాతం నుంచి 10.27 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్, బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సురెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ మార్కెట్ వాటా సైతం ఒక్కో శాతం మేర పెరగడం గమనార్హం.
మరోవైపు ఇప్పటికీ ఏజెంట్ల నెట్వర్క్పైనే ఎల్ఐసీ ఎక్కువగా ఆధారపడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యాపారంలో 96 శాతం కొత్త పాలసీలు.. ఏజెంట్లు, ఇన్సురెన్స్ అడ్వైజర్ల రూపంలో వచ్చినవే. అదే సమయంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 18, హెచ్డీఎఫ్సీ 20 శాతం పాలసీలు మాత్రమే ఏజెంట్ల నుంచి రావడం గమనార్హం. ప్రైవేటు కంపెనీలు ప్రధానంగా డిజిటల్ బాట పడుతుండగా.. ఎల్ఐసీ మాత్రం ఇంకా ఏజెంట్లపైనే ఆధారపడుతోందని పేర్కొంటున్నారు. యువత ఎక్కువగా డిజిటల్ సర్వీసులను కోరుకుంటున్నారని, ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కారానికి కూడా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు డిజిటల్ విషయంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..? ఈ టిప్స్ ట్రై చేయండి
Tech Tip: మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా? చాలా నెమ్మదిగా వర్క్ చేస్తోందా? అయితే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. -
9 నిమిషాల్లో ఛార్జింగ్.. 965 కి.మీ. ప్రయాణం!
బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందేమో.. ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతుక్కోవాలి.. ప్రస్తుతం విద్యుత్తు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారి ఆలోచన తీరు ఇది. ఎక్కడికైనా వెళ్దామని నిర్ణయించుకుంటే.. -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా పెట్టుబడిదారులు
స్వేచ్ఛగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోంది. -
దివాలా అనుమతులు భేష్
గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రికార్డు స్థాయిలో 269 కేసులకు సంబంధించి దివాలా పరిష్కార ప్రణాళికలకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతినిచ్చింది. -
తప్పనిసరి నమోదు నిబంధన నుంచి టాటా సన్స్ బయటపడినట్లే!
తప్పనిసరిగా నమోదు కావాలనే ఆంక్షల నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)తో టాటా సన్స్ ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. -
ఉద్యోగాల సృష్టికి కీలకంగా జీసీసీలు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ఉద్యోగాల సృష్టికి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా దేశంలో తాత్కాలిక ఉద్యోగులకు వీటి వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. -
రూ.27,000 కోట్లతో టాటాల చిప్ ప్లాంటు
అస్సాంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని... -
ఎస్బీఐ లాభం రూ.19,325 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.19,325 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(8)
దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.2,142 కోట్ల ఆదాయం, రూ.430 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లైఓవర్ పై నుంచి కిందపడి.. ఇద్దరు యువకుల మృతి
-
ఎస్సీ వర్గీకరణపై ‘సుప్రీం’ తీర్పుతో ఏకీభవించం: మాయావతి
-
నేనేదీ ప్లాన్ చేయను.. ఆ పాత్రకు శ్రీకాంత్నే అనుకున్నా: కృష్ణవంశీ
-
ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది మృతి.. టెల్అవీవ్ శివార్లలో కత్తిపోట్ల కలకలం!
-
ఖాకీల కర్కశత్వం.. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
-
డిజిటల్ విద్య.. మితిమీరితే ప్రతికూలమే : ఐరాస