ఈ వృద్ధురాలికి న్యాయం చేయలేరా?
నెల కాదు.. ఏడాది కాదు.. దాదాపు పదేళ్ల నుంచి ఆ వృద్ధురాలు ఠాణా చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.
గొలుసు చోరీ కేసును ఛేదించని పోలీసులు
పదేళ్ల నుంచి తిరుగుతున్నా ఫలితం శూన్యం
కడప నేరవార్తలు, న్యూస్టుడే
రామసుబ్బమ్మ
నెల కాదు.. ఏడాది కాదు.. దాదాపు పదేళ్ల నుంచి ఆ వృద్ధురాలు ఠాణా చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దొంగ దొరికితే బంగారు దొరకడం లేదు.. బంగారం దొరికితే దొంగ దొరకడం లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆమెకు న్యాయం చేకూరలేదు. కడప ఎర్రముక్కపల్లెకు చెందిన రామసుబ్బమ్మ 2014 ఆగస్టు 14న నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. వెంటనే ఆమె ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అప్పట్లో గొలుసు విలువ రూ.50 వేలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదేళ్ల నుంచి ఆమె ఇటు ఠాణాకు, అటు ఎస్పీ స్పందన కార్యక్రమాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్నో కేసులు ఛేదించారు... పోగొట్టుకున్న సొమ్మును బాధితులకు అప్పగించారు. ఈ వృద్ధురాలికి మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. తాజాగా సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల-పరిష్కారం వేదికలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కూడా బాధితురాలు కలిశారు. ఆయన తిరిగి సంబంధిత ఠాణాకు బదలాయించారు. ఇప్పుడైనా పోలీసులు చర్యలు చేపడతారో లేదా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊరూరా ఇసుక తోడేళ్లు
[ 05-08-2024]
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ వైఎస్ఆర్ జిల్లాలో ఇసుక దోపిడీ జోరు ఆగలేదు. దీనిని అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. -
త్వరలో వెయ్యి కొత్త బస్సులు
[ 05-08-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. కడప ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ఆదివారం 18 ఆర్టీసీ, అద్దె బస్సులను ఆయన ప్రారంభించారు. -
తలపై కలశం... అమ్మకు ఆషాఢ బోనం
[ 05-08-2024]
శ్రీచౌడేశ్వరీదేవి జయంతి సందర్భంగా నిర్వహించిన కలశం బిందెల ఊరేగింపు ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనులపండువగా సాగింది. -
పురపాలక సంఘాలకు మహర్దశ
[ 05-08-2024]
పురపాలక సంఘ పరిధిలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే నిధులను మంజూరు చేసింది. -
హార్సిలీహిల్స్ టౌన్షిప్ పాలన ఎలా?
[ 05-08-2024]
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21వతేదీ రాత్రి దస్త్రాల దహనం వ్యవహారం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్పై పడింది. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
[ 05-08-2024]
రాష్ట్ర విభజన హామీలతో పాటు ప్రత్యేక ప్యాకేజీని కూటమి ప్రభుత్వం సాధించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఎఐఎఫ్బీ) జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ కోరారు. -
అనాథలకు అమ్మ!
[ 05-08-2024]
అనాథ చిన్నారులకు అమ్మా, నాన్న అన్నీ తానే అవుతున్నారామె. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి వారి ఆలనాపాలన చూస్తున్నారు. -
విద్యా సంస్థల్లో ఎన్నికల వేఢీ
[ 05-08-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు తీరి 60 రోజులువుతోంది. ఎన్నికల హడావుడి నుంచి అధికారులు, నేతలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.