- TRENDING
- US Elections 2024
- Ratan Tata
- IND vs BAN
- HYDRA
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీం కీలక తీర్పు
భరణానికి సంబంధించిన హక్కును కల్పించే 125 సీఆర్పీసీ సెక్షన్ కింద ముస్లిం మహిళలు పిటిషన్ దాఖలు చేయొచ్చని నేడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దిల్లీ: ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.
‘‘సెక్షన్ 125 వివాహితలకే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితలు భరణం కోరవచ్చు. భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదు. భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదు. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది’’ అని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అజాగ్రత్త వద్దు.. పొరుగు నుంచి కవ్వింపు చర్యలు రావచ్చు: రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డార్జిలింగ్లోని సుక్నా కాంట్ను సందర్శించి.. ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. -
అక్టోబరు 17న హరియాణా సీఎంగా నాయబ్సింగ్ ప్రమాణస్వీకారం
హరియాణాలో వరుసగా మూడోసారి విజయం సాధించిన భాజపా కొత్త సర్కారు పంచకులలో అక్టోబరు 17న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు నేర్వరా..? రాహుల్ గాంధీ
భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల నుంచి కేంద్రం ఎటుంవటి గుణపాఠాలు నేర్చుకోవడం లేదని మండిపడ్డారు. -
మహావైభవం.. మైసూర్చాముండేశ్వరీ దేవి ఉత్సవాలు
క్రౌంచపుర స్థితా మాతా చాముండీ దుష్టనాశనీసర్వసిద్ధిప్రదా దేవి భక్తపాలన దీక్షితా.. అని అశేష భక్తజనం చాముండేశ్వరీ దేవిని స్తుతిస్తూ అమ్మవారిపై భక్తిప్రపత్తులను చాటుకుంటారు. ప్రచారంలో ఉన్న పురాణ కథను అనుసరించి రాక్షసుడైన మహిషాసురుడు తన సమూహంతో దేవతలపై దండెత్తాడు. -
భారత్లో మాట్లాడే ప్రతిభాషా జాతీయ భాషే: ఆర్ఎస్ఎస్
RSS- Mohan Bhagwat : కులాలు, మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే సమాజం సామరస్యంతో విలసిల్లుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. -
జామ్నగర్ రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా
జామ్నగర్ రాజకుటుంబ సింహాసనానికి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తదుపరి వారసుడిగా ప్రకటించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నాసిక్లో ఇద్దరు ‘హైదరాబాద్’ అగ్నివీరుల మృతి
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ సాధన చేస్తుండగా ఇండియన్ ఫీల్డ్ గన్లోని షెల్ పేలడంతో వారు మృతి చెందారని పోలీసులు శుక్రవారం తెలిపారు. -
గూడ్స్ రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్ప్రెస్
తమిళనాడులో శుక్రవారం రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎంతోమంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొంది. -
విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానన్న ట్రంప్.. అమెరికాలోనూ ఉచితాలు: కేజ్రీవాల్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్తు ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ‘‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్తు సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. -
కోల్కతాలో 6వ రోజుకు చేరిన జూడాల నిరాహార దీక్ష
పశ్చిమబెంగాల్లోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూడాలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారంతో ఆరోరోజుకు చేరింది. -
తిరుచ్చి-షార్జా విమానంలో సాంకేతికలోపం
తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 141మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.40గంటలకు షార్జా బయలుదేరింది. -
కిరీటం దొంగలను త్వరగా పట్టుకోండి.. బంగ్లాదేశ్కు భారత్ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2021లో జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. దీనిపై తాజాగా బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ స్పందించింది. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరింది. -
పండగపూట మీ ఇంట్లో ఇది చర్చించండి
మన తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు సహా మహిళల గురించి పురుష సమాజం ఆలోచించే విధానం మారాలి. వారిని మనతో సమానంగా భావించి గౌరవించాలి తప్ప వస్తువుల్లా పరిగణించకూడదు. -
అజేయుడైన పారిశ్రామికవేత్తకు అచ్చిరాని సినిమా!
ఆయనకేం అదృష్ట జాతకుడు. పట్టిందల్లా బంగారమే’’ అంటుంటారు కొందరి గురించి. నిజజీవితంలో ఎంతటి విజేతకైనా దిష్టి తీసినట్టుగా ఒకటీ అరా వైఫల్యాలు ఉంటాయి. -
రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్గా భాజపా ఎంపీ ఘనశ్యామ్
రాజస్థాన్కు చెందిన భాజపా ఎంపీ ఘనశ్యామ్ తివారీ రాజ్యసభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. కమిటీ పునర్నిర్మాణంలో భాగంగా ఎగువసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఈ నియామకాన్ని చేపట్టారు. -
చిరుత దాడిలో మరో చిన్నారి మృతి
ఉత్తర్ప్రదేశ్లో చిరుత పులుల వరుస దాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘విశ్వంభర’ వాయిదా అసలు కారణమిదే: నిర్మాత
-
అజాగ్రత్త వద్దు.. పొరుగు నుంచి కవ్వింపు చర్యలు రావచ్చు: రాజ్నాథ్ సింగ్
-
అక్టోబరు 17న హరియాణా సీఎంగా నాయబ్సింగ్ ప్రమాణస్వీకారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నటిని అవమానిస్తూ వీడియోలు.. నటీనటులపై కేసు
-
హాంగ్కాంగ్ సిక్సెస్ 2024.. టీమ్ఇండియా కెప్టెన్గా రాబిన్ ఉతప్ప