IPL-Buttler-Hafeez: ఐపీఎల్పై బట్లర్ వ్యాఖ్యలు.. తప్పుబట్టిన పాక్ మాజీకి మైకెల్ వాన్ గట్టి కౌంటర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఆదరణ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఇలాంటి లీగ్పై ఎప్పుడు అవకాశం వచ్చినా కామెంట్ చేయడానికి సిద్ధంగా ఉండే పాక్ మాజీ క్రికెటర్ ఒకరికి మైకెల్ వాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)) జరుగుతున్నప్పుడు ఐసీసీ క్యాలెండర్లో అంతర్జాతీయ మ్యాచ్లు లేకుండా చూడాలని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చేసిన వ్యాఖ్యలను పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ తప్పుబట్టాడు. ఓ పాడ్కాస్ట్లో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్, ఇంగ్లాండ్ మాజీ సారథి మైకెల్ వాన్తో కలిసి హఫీజ్ పాల్గొన్నాడు. ఈ వరల్డ్ కప్ ముందు బట్లర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. తనను షాక్కు గురిచేశాయని హఫీజ్ పేర్కొన్నాడు.
‘‘దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తూ కెప్టెన్గా ఉన్న జోస్ బట్లర్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని అనుకోలేదు. ఐపీఎల్ సమయంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఉండకూడదని చెప్పడం విడ్డూరంగా ఉంది. దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వంగా ఫీల్ కావాలి. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు’’ అని హఫీజ్ వ్యాఖ్యానించగా.. మైకెల్ వాన్ మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా జరుగుతుందని గుర్తు చేశాడు.
ఇక్కడ ఆడితే అనుభవం వస్తుంది
‘‘జోస్ బట్లర్ వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. ఇలాంటి మెగా లీగుల్లో పాల్గొనడం వల్ల ఆటపరంగా ప్రతిఫలం లభిస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే ఐపీఎల్లో ఆడటం గొప్పగా భావిస్తారా? అని కొందరు ప్రశ్నించొచ్చు. ఇక్కడ ఓ అంశం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్. క్రికెట్ బోర్డులు ఏవీ కూడా దానితో పోటీపడలేవు. అందుకే తమ ఆటగాళ్లను ఈ లీగ్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడమే అందరికీ మంచిది. వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా జరుగుతుంది కదా. ఐపీఎల్, పీఎస్ఎల్ వల్ల ఎక్కువ ప్రభావం ఇంగ్లాండ్ క్రికెటర్ల మీదే ఉంటుంది. అదే సమయంలో (మార్చి, మే) కౌంటీ క్రికెట్ షెడ్యూల్ ఉంటుంది. స్టార్ క్రికెటర్లు మిస్ అవుతారు. అలాగని ఇతర లీగులను తక్కువ చేయడానికి వీల్లేదు’’ అని వాన్ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ సెమీస్కు దూసుకుపోగా.. పాక్ మాత్రం లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆ అక్కసునంతా ఇలా ఐపీఎల్పై చూపిస్తున్నాడని హఫీజ్ను విమర్శిస్తూ నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాండర్సే వండర్.. శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమి
ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్పై శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
శ్రేయస్ అయ్యర్ సూపర్ డైరెక్ట్ త్రో.. కమిందు రనౌట్!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య జరుగుతున్న రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ తన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. అర్ష్దీప్ వేసిన చివరి ఓవర్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రో విసిరి కమిందును రనౌట్ చేశాడు.
-
ర్యాపిడ్ ఫైర్ పిస్టల్.. క్వాలిఫికేషన్ రౌండ్లో నిరాశపర్చిన భారత షూటర్లు
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ పురుషుల 25మీ.ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో భారత షూటర్లు విజయ్వీర్, అనీశ్ భన్వాలా నిరాశపర్చారు. -
రెండో వన్డే.. సమష్టిగా రాణించిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 241
మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య నేడు రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. -
నీరజ్ గోల్డ్ సాధిస్తే.. భారతీయులకు బంపర్ ఆఫర్: వీసా ఫ్లాట్ఫాం సీఈవో
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఈ సారి బంగారు పతకం సాధిస్తాడనే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ వీసా ఫ్లాట్ఫాం అట్లీస్ వ్యవస్థాపకుడు మోహక్ నహ్తా భారత వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. -
పారిస్ ఒలింపిక్స్.. సెమీ ఫైనల్లో ఓడిన లక్ష్యసేన్
ఒలింపిక్స్లో సెమీఫైనల్ చేరుకుని చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కీలక మ్యాచ్లో తడబడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో 20-22, 14-21 తేడాతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
భారత్ పతక ఆశలు ఆవిరి.. క్వార్టర్స్లో ఓడిన లవ్లీనా
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. -
పారిస్ ఒలింపిక్స్.. సెమీస్కు దూసుకెళ్లిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్లో హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. -
భారత్-శ్రీలంక రెండో వన్డే.. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య టీమ్
సిరీస్లో ఆధిపత్యం సాధించాలంటే రెండో వన్డే అత్యంత కీలకం. ఇప్పటికే మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో రెండో వన్డేపై అందరి దృష్టి ఉంది. -
ముక్కుసూటితనంతో గంభీర్ పూర్తి పదవీకాలంలో ఉండటం కష్టమే: జోగిందర్ శర్మ
ఇప్పుడే ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మున్ముందూ ‘టాప్ ఆర్డర్’తోనూ బౌలింగ్ చేయిస్తాం: భారత కోచ్ బహుతులే
ఓపెనర్ గిల్తో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఓవర్ వేయించి కొత్త ప్రయోగాలకు భారత మేనేజ్మెంట్ తెరతీసినట్లు కనిపిస్తోంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వినూత్న ఆలోచనలతో ఉంటాడని మనందరికీ తెలుసు.. -
ఇమానె ఖెలిఫ్ తండ్రి వివరణ.. ఇకనైనా వివాదానికి ముగింపు పలికేనా?
అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ విషయంలో భిన్నాభిభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమె తండ్రి వివరణ ఇచ్చారు. -
శ్రీలంకకు భారీ షాక్.. వన్డే సిరీస్ నుంచి కీలక ఆటగాడు ఔట్
భారత్తో రెండో వన్డేకు సిద్ధమవుతున్న శ్రీలంకకు షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ గాయం కారణంగా సిరీస్కే దూరం కావడం ఆ జట్టు అభిమానులకు నిరాశపరిచే అంశమే. -
భారత యువ షూటర్ మను బాకర్కు అరుదైన గౌరవం!
ఒలింపిక్స్లో పతాకధారిగా ఉండటం ఏ అథ్లెట్కైనా గౌరవమే. ఇప్పుడు ఆ ఛాన్స్ యువ షూటర్ మను బాకర్కు దక్కింది. -
నీ నుంచి మెడల్ను దోచేశారు..: వివాదాస్పదంగా మారిన బాక్సర్ నిశాంత్ దేవ్ ఓటమి
బాక్సింగ్లో భారత్కు మరో ఓటమి ఎదురైంది. 71 కేజీల విభాగంలో నిశాంత్ దేవ్ పరాజయం పాలయ్యాడు. అయితే, ఈ పోరు స్కోరింగ్ వివాదాస్పదంగా మారింది. -
నిజమే.. ఇంగ్లిష్లో అడిగితే బాబర్కు కష్టమే కదా!: పాక్ ఫ్యాన్కు హర్భజన్ కౌంటర్
భారత క్రికెటర్లను ఏమైనా అంటే సరైన సమాధానం ఇచ్చేందుకు హర్భజన్ సింగ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ విషయంలో పాక్ అభిమాని చేసిన పోస్టుపై తీవ్రంగా స్పందించాడు. -
గురి తప్పింది కొద్దిలో
పతకం లేకుండా వరుసగా రెండోరోజు! పారిస్ ఒలింపిక్స్లో రోజు విడిచి రోజు పతకంతో మెరిసిన భారత్కు శనివారం నిరాశే ఎదురైంది. -
చిరుతల పోరుకు వేళాయె..!
ఒలింపిక్స్లో ఎన్నో అద్భుత ఈవెంట్లు. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అయితే వీటన్నింట్లో కళ్లు విప్పార్చి చూసే ఒక ఈవెంట్ ఉంది. -
జులియన్ జిగేల్
పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో కరీబియన్ అమ్మాయి జులియన్ ఆల్ఫ్రెడ్ విజేతగా నిలిచింది. -
లక్ష్య సాధించేనా..
ఒలింపిక్స్లో సెమీఫైనల్ చేరుకుని చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో రికార్డుపై గురిపెట్టాడు. -
బైల్స్ హ్యాట్రిక్
టోక్యో ఒలింపిక్స్ చేదు గుర్తులను చెరిపేస్తూ పారిస్లో స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ పసిడి వేట కొనసాగిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్ చేరుకున్న ఎఫ్-16 యుద్ధవిమానాలు.. వీడియో షేర్ చేసిన జెలెన్స్కీ
-
బ్రిటన్లో అల్లర్లు.. హెచ్చరించిన ప్రధాని స్టార్మర్
-
ఆస్కార్ అంటూ అభిమానుల కేరింతలు: విక్రమ్ ఆసక్తికర సమాధానం
-
రక్షణ పరిశోధన రంగంలో నాయకత్వం దిశగా భారత్: సతీశ్రెడ్డి
-
వాండర్సే వండర్.. శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమి
-
ఇలాంటి ఛాన్స్ ఎప్పుడోగానీ రాదు: రామ్ పోతినేని