దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు
దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం
బృహత్తర ప్రణాళికతో కొత్తరూపు
అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్
ఈనాడు, కరీంనగర్; న్యూస్టుడే- మల్యాల: దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘హనుమాన్ జయంతి ఇక్కడి క్షేత్రంలో గొప్పగా జరిగేలా.. దేశంలో సగం మంది భక్తులు ఈ దివ్యధామానికి వచ్చేలా ప్రాంగణాల్ని పూర్తిగా మార్చాలి. ఇప్పుడున్న ప్రధాన ఆలయం సహా పరిసరాల రూపురేఖల్ని మార్చేలా బృహత్తర ప్రణాళికను అమలు చేసి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి’ అని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి, హోదాలో తొలిసారిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకోవడానికి ముందే హెలికాప్టర్ నుంచి పరిసరాలను గమనించారు. సిబ్బంది పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సుమారు అరగంటపాటు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న ఉప ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు శాలువా కప్పి, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వచనాల్ని అందించారు. తరువాత ఆలయ సమీపంలో సుమారు రెండు గంటలపాటు క్షేత్ర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి ఇటీవల రూపొందించిన ప్రణాళికను, వివిధ మ్యాప్లను సీఎం పరిశీలించారు. వాస్తు నియమాలను అనుసరించి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. గుట్ట పైభాగంలో ఎకరం స్థలంలో ఉన్న గుడిని ఆధునికీకరించే ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు చెప్పగా.. ఆ స్థలం సరిపోదని.. మూడెకరాల విస్తీర్ణం విధిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
మూలమలుపులను తొలగించాలి
‘‘ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రస్తుతం 1.8 కి.మీ.లు ఉన్న ఘాట్ రోడ్డును 3 కి.మీ.ల దూరం పెంచి మూలమలుపులను తొలగించాలి. జేఎన్టీయూ మీదుగా వచ్చే రహదారి వెడల్పుని ఇప్పుడున్న 7 మీటర్ల నుంచి 14 మీటర్లకు విస్తరించండి. ఈ రెండింటినీ పాత పుష్కరిణి వరకు పొడిగించాలి. సువిశాలమైన ప్రధాన ద్వారాన్ని నిర్మించాలి. అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాన్ని ప్రణాళికలో పొందుపర్చాలి.
విద్యుత్తు ఉపకేంద్రం, దవాఖానా, ప్రయాణ ప్రాంగణం, అగ్నిమాపక కేంద్రం, కాటేజీలు, పోలీస్స్టేషన్, దీక్షా విరమణ మండపం పక్కనే కల్యాణకట్ట ఏర్పాటు చేయండి. గుట్టపై తాగునీటి వసతిని మెరుగుపర్చేలా సమీపంలోని సంతోల్ల లొద్ది నుంచి కొండపైకి నిరంతర నీటి సరఫరా చేపట్టాలి. అవసరమైతే వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలను గుట్టపైకి తెండి. మానసిక రోగులు ఉండేందుకు వీలుగా కేర్ టేకర్లతో కూడిన భవనాన్ని నిర్మించాలి. అటవీశాఖ అధికారులూ.. ఇక్కడి అభయారణ్యంపై తగిన దృష్టి పెట్టండి. అవసరమైనన్ని ఔషధ మొక్కలను నాటించాలి. మైసూర్ - ఊటీ మార్గంలోని నీలగిరి కొండల్లోని బందీపుర్ అభయారణ్యం మాదిరిగా మార్చండి.
త్వరలో మళ్లీ వస్తా...
వారం, పది రోజుల్లో మళ్లీ కొండగట్టుకు వస్తా. రాత్రి వేళ ఇక్కడే ఉండి అభివృద్ధిపై సమీక్షిస్తా. మూడేళ్లలో ఇక్కడి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చొరవ చూపిస్తా. అర్చకుల కోసం ఇళ్లను కట్టిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమీక్ష నిర్వహించే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కుర్చీలను వేసి వేదికను ఏర్పాటు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పైకి వెళ్లకుండా ముందు భాగంలో కుర్చీలో ఆసీనులై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
సమీక్ష నిర్వహణ సమయంలో ఆర్కిటెక్ట్ ఆనంద్సాయిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. మైక్ ద్వారా ఉన్నతాధికారులు పిలవడంతో పోలీసులు ఆయన్ని లోపలికి పంపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, భానుప్రసాద్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్కుమార్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్రెడ్డి తదితరులు ఉన్నారు.
వెయ్యి కోట్లయినా...
యాదాద్రి ఆలయానికి మించిన స్థలం ఇక్కడి గుట్ట ఆవరణలో ఉంది. సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకర్షించే గొప్ప ధార్మిక క్షేత్రంగా కొండగట్టును మార్చాలి. ఇందుకోసం ఇప్పటికే ప్రకటించిన రూ.100 కోట్లు కాకుండా అవసరమైతే మరో రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లను కేటాయించుకుందాం.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆలయమిది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఇక్కడి గుట్టకు లక్షల భక్తులు వచ్చేలా రూపురేఖల్ని మార్చాలి. దీక్షాపరులు ఒకేసారి 50వేల మంది వచ్చినా.. బస చేయడానికి.. మాల విరమణ చేయడానికి వసతి ఉండాలి. ఆలయానికి దగ్గరగా 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్ను ఏర్పాటు చేయండి. ఇక్కడి పచ్చదనం, పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదు. చెట్ల మధ్యనే భక్తుల కోసం అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలి.
వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గర్భాలయం మినహా మిగతా ఆలయాన్ని పునర్నిర్మాణంతో విస్తరించాలి. యాదాద్రి ఆలయ నిర్మాణ సమయంలో సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాలు చేపట్టాం. అదే మాదిరిగా ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడదాం. తిరుమల పుణ్యక్షేత్రాన్ని గుర్తుచేసేలా ఇక్కడి ప్రాంగణాల్ని తీర్చిదిద్దాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఆదివారం ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్రెడ్డి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. -
బీమా సొమ్ము ఎగవేతకు నకిలీ ఆధారాల సృష్టి
జీవిత బీమా పాలసీ సొమ్ము నిరాకరించడానికి ఓ బీమా సంస్థ నకిలీ అధారాలను సృష్టించింది. ఓ ఆసుపత్రిలో పాలసీదారు చికిత్స పొందినట్లు చూపి, వాస్తవాలను దాచి పాలసీ తీసుకున్నారన్న నెపంతో పాలసీని తిరస్కరించింది. -
నెదర్లాండ్స్లో ఘనంగా ‘అన్నమాచార్య ఆరాధన’
నెదర్లాండ్స్లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, దేవాలయ కాంప్లెక్స్ నిర్మించాలన్నదే స్టిచింగ్ వసుదైవ కుటుంబకం (కేవీకే) లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా సనాతన ధర్మ విలువలు బోధించడంతో పాటు ప్రజలంతా కలిసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేస్తామని పేర్కొంది. -
టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
హైదరాబాద్, వరంగల్లోని టీజీఎస్ఆర్టీసీ(తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. -
డంబెల్ ఆకారంలో ఇంటర్ఛేంజ్లు
ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) పరిధిలో సేకరించాల్సిన భూవిస్తీర్ణం పెరగనుంది. హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) ఆవల నుంచి ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్న విషయం తెలిసిందే. -
ఎరువుల దుకాణాల్లో ఇక విస్తృతంగా తనిఖీలు
దేశవ్యాప్తంగా నకిలీ ఎరువులను అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీనికోసం విస్తృతంగా నాణ్యత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిత్యం ఎరువుల నమూనాలను తీసి ప్రయోగశాలల్లో పరీక్షలు చేయించి ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైంది. -
ఆరు హోల్సేల్ మందుల డిస్ట్రిబ్యూషన్ల లైసెన్స్లు రద్దు
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి బిల్లులు లేకుండా మందులను కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఆరు హోల్సేల్ మందుల డిస్ట్రిబ్యూషన్ సంస్థల లైసెన్స్లను 30 రోజులపాటు రద్దు చేస్తూ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) చర్యలు తీసుకుంది. -
పీఆర్ఎల్ఐ సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి మృతి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఎల్ఆర్ఐ) పథకం సీనియర్ కన్సల్టెంట్, విశ్రాంత ఇంజినీర్ ఎన్.రంగారెడ్డి అనారోగ్యంతో సోమవారం మరణించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన గత ప్రభుత్వం.. ప్రారంభంలోనే రంగారెడ్డిని ఈ ప్రాజెక్టుకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించింది. -
విద్యుత్ అంతరాయాలపై ప్రభుత్వం ఆరా!
-
నెహ్రూ ‘ప్రణాళికల’తోనే ప్రగతికి బాటలు పడ్డాయి
తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ తెచ్చిన పంచవర్ష ప్రణాళికలు దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాయని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.రాజెన్ హర్షే పేర్కొన్నారు. -
కార్టూన్
-
రాష్ట్ర చిహ్నంలో మార్పులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులపై ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం బృందంతో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం చిత్రకారులతో ఆయన భేటీ అయ్యారు. -
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ
రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈసారి సగటున సాధారణం కంటే అధిక వర్షపాతానికి అవకాశాలున్నట్లు పేర్కొంది. -
వానాకాలం పంటలకు మంచి ధరలు
రాష్ట్రంలో జూన్ 1 నుంచి మొదలయ్యే వానాకాలం (2024-25) సీజన్లో పండించే పంట ఉత్పత్తులకు మార్కెట్లలో మంచి ధరలు లభించే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. -
మృతుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాలి
హైదరాబాద్ హఫీజ్పేట సాయినగర్లో ఆదివారం ఈదురు గాలులు, వర్షాలకు ఇటుకలు ఎగిరిపడిన ఘటనలో మృతి చెందిన రషీద్, చిన్నారి సమద్ల కుటుంబాలను మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి సోమవారం పరామర్శించారు. -
1 నుంచి బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలు
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(బాసర)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
సెర్చ్ కమిటీలూ ఏర్పాటు చేయలే..
రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 10 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతు(వీసీ)ల నియామకానికి రంగం సిద్ధమవుతుండగా.. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల వీసీల విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర ఎలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. -
వరద వచ్చేలోపు పనులు పూర్తవ్వాలి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతులు, పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేసిన రక్షణ, పనుల పర్యవేక్షణ కమిటీ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. -
ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? అందుకు అనుసరించిన వ్యూహమేంటి? ఎలా అమలు చేశారు వంటి వివరాలు బయటపడ్డాయి. -
కడగండ్ల కాలువలు
వానాకాలం ఏరువాకకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. సాగునీటి కాలువల్లో ప్రవాహానికి ముందే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేయాల్సిన నీటిపారుదలశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/05/24)
-
ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ.. ఇలా ఇరికిస్తే ఎలా?: రష్మిక
-
మోదీ బస.. ఆ రూ.80లక్షల బిల్లు మేమే చెల్లిస్తాం - కర్ణాటక ప్రభుత్వం
-
నేహాశర్మ ‘ఇల్లీగల్’ ప్రమోషన్స్.. పాట కోసం నోరా ఎదురుచూపులు!
-
ఇటు షారుక్.. అటు గంభీర్