Novak Djokovic: మీకు ఇంకేం ప్రశ్నలు లేవా? ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన జకోవిచ్!
పదే పదే ఒకే విషయంపై ప్రశ్నలు వేయడంతో టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ప్రేక్షకులు కూడా సరైన మర్యాద పాటించకపోవడంపైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వింబుల్డెన్ 2024 ఎడిషన్లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic)కు ప్రేక్షకుల నుంచి విభిన్న అనుభవం ఎదురైంది. రౌండ్ 16 సందర్భంగా హోల్గర్ రూనెతో జకోవిచ్ పోటీపడ్డాడు. ఆ మ్యాచ్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకుపోయాడు. ఇవాళ మినౌర్తో తలపడనున్నాడు. అయితే, నాలుగో రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఓ రిపోర్టర్తో జకోవిచ్ మాట్లాడుతూ ఉండగానే ప్రేక్షకులు అరుపులతో హోరెత్తించారు. అగౌరవంగా ప్రవర్తించడంపై జకోవిచ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. కొందరు తమ పరిధిని దాటారని.. ఇలా చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేశాడు.
‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఉంటా. రోజంతా టెన్నిస్ను చూస్తూ ప్రోత్సహించడం సులువేం కాదు. అందుకోసం వారికి థాంక్స్ చెబుతా. ఇప్పటికీ నేను ఆడుతున్నానంటే దానికి కారణం వారి మద్దతే. కానీ, ఇవాళ కొందరు హద్దులు దాటారు. ఇలాంటప్పుడు తప్పకుండా వెంటనే స్పందిస్తా. కోర్టులో చేసే వ్యాఖ్యలు, చర్యలకు నేనేం పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు’’ అని సమాధానం ఇచ్చాడు.
దానిపైనే దృష్టి పెడతారా?
ఆ రిపోర్టర్ మరోసారి ప్రేక్షకులకు సంబంధించిన ప్రశ్ననే అడిగారు. దాంతో జకోవిచ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఈ టాపిక్ కాకుండా మరే ప్రశ్నలు లేవా? అని ప్రతిస్పందించాడు. ‘‘ప్రేక్షకుల ప్రవర్తన వ్యవహారం కాకుండా ఇతర ప్రశ్నలు మీ దగ్గర లేవా? మీరు కేవలం దానిపైనే దృష్టి పెడతారా? ఇప్పటికే మూడు ప్రశ్నలు అడిగారు. ఇక సరిపోతుంది. ఇతర విషయాలపై మనం మాట్లాడుకుంటే బెటర్’’ అని ఇంటర్వ్యూని ముగించాడు. ఆ తర్వాత మీడియా సంస్థ కూడా ఈ వ్యవహారంపై పోస్టు చేసింది. ప్రేక్షకులకు సంబంధించిన ప్రవర్తనపై స్పందించాల్సిందిగా జకోవిచ్ను అడగ్గా.. మధ్యలోనే వెళ్లిపోవడం జరిగిందని పేర్కొంది.
ఇంతకీ ఏమైందంటే?
డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థి రూనెతో మ్యాచ్లో ఓ పాయింట్ విషయంలో జకోవిచ్ అప్పీలు చేశాడు. ఆ సమయంలో రూనెకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రేక్షకుల్లో కొందరు విపరీతంగా ప్రవర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మైదానంలోనే జకోవిచ్ స్పందించాడు. ‘మీరు కనీసం నన్ను టచ్ కూడా చేయలేరు’ అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్ టీమ్ ఇండియా స్పాన్సర్గా అదానీ గ్రూప్..!
అదానీ గ్రూప్ ఈసారి పారిస్ ఒలింపిక్స్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ ప్రకటించారు. -
వీడ్కోలు నిర్ణయం.. వారి వ్యక్తిగతం: కుల్దీప్ యాదవ్
భారత క్రికెట్కు ఘనమైన సేవలు అందించిన ముగ్గురు స్టార్ క్రికెటర్లు టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
బ్యాటర్ల మధ్య తీవ్ర పోటీ.. టీమ్ఇండియాకు మంచిదే: ఆండీ ఫ్లవర్
అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఇద్దరు క్రికెటర్లలో ఎవరిని ఆడించాలనే సంకట స్థితి ఇప్పుడు టీమ్ఇండియాలో ఉంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. -
నాకు రూ.5 కోట్లు వద్దు.. బోనస్పై రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!
భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాడు. అయితే, మొన్నటివరకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రశంసలు అందించేలా చేస్తోంది. -
ఇక గంభీర్ ఇన్నింగ్స్
అంచనాలు నిజమయ్యాయి. భారత క్రికెట్ కోచింగ్లో గంభీర్ శకం మొదలవబోతోంది. ఊహించినట్లే బీసీసీఐ అతణ్ని ద్రవిడ్ స్థానంలో టీమ్ఇండియా కోచ్గా నియమించింది. శ్రీలంక పర్యటనతో కోచ్గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. -
చిత్తు చేసి పంపించారు
వన్డేల్లో క్లీన్ స్వీప్.. ఏకైక టెస్టులోనూ ఘనవిజయం.. ఇప్పుడు టీ20 సిరీస్ సమం. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టుకు భారత పర్యటనలో సిరీస్ విజయమే దక్కలేదు. -
యువ భారత్కు ఎదురుందా?
జోరుమీదున్న టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్.. బుధవారం కీలకమైన మూడో టీ20లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. -
ఆమే ఒక సైన్యం
వెయిట్లిఫ్టింగ్.. ఒలింపిక్స్లో ఈ ఈవెంట్లో భారత్కు పెద్ద ఆశలు ఉండవు. 2000 సిడ్నీ క్రీడల్లో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి కంచు కొట్టిన తర్వాత లిఫ్టింగ్లో భారత్కు కలిసి రాలేదు. -
సినర్ ఔట్
వింబుల్డన్లో మహిళల్లో టాప్సీడ్ స్వైటెక్ ఇప్పటికే ఓడిపోగా.. పురుషుల సింగిల్స్లో నంబర్వన్ సీడ్ సినర్ కూడా ఇంటిముఖం పట్టాడు. -
అండర్సన్ ఎలా ముగిస్తాడో!
గ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కెరీర్లో ఆఖరి టెస్టు ఆడబోతున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న అతడు బుధవారం వెస్టిండీస్తో ఆరంభమయ్యే తొలి టెస్టుతో చివరగా బరిలో దిగనున్నాడు. -
ఇంగ్లాండ్తో నెదర్లాండ్స్ ఢీ
యూరో 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. ఇంగ్లాండ్ బుధవారం జరిగే సెమీఫైనల్లో నెదర్లాండ్స్ను ఢీకొంటుంది. -
ద్రవిడ్.. వృత్తిపరమైన భార్య
పేరు ప్రఖ్యాతుల్ని డ్రెస్సింగ్ రూమ్ బయటే వదిలేసి తమతో కలిసిపోయాడంటూ మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు. -
వార్నర్లో మళ్లీ వన్డే ఆశలు
తన అంతర్జాతీయ క్రికెట్ అధ్యాయం ముగిసిందని.. కానీ పూర్తిగా కాదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తే ఆడేందుకు సిద్ధమని తెలిపాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీకు ఇంకేం ప్రశ్నలు లేవా? ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయిన జకోవిచ్!
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ ఛైర్మన్ భేటీ
-
మోటో నుంచి మిడ్ రేంజ్ 5జీ ఫోన్.. జీ85 వివరాలు ఇవీ..
-
విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు?: కేటీఆర్
-
సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని: వీహెచ్
-
ప్రొబేషనరీ ఐఏఎస్ గొంతెమ్మ కోర్కెలు.. కన్నెర్ర చేసిన ప్రభుత్వం